రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌పై కీల‌క సూచ‌న‌లు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ చలానా సిస్టమ్ తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు నిర్వహణ అంశాలపై రోడ్ సేఫ్టీ ఏడీజీ శ్రీ కృపానంద త్రిపాఠి , రోడ్ సేఫ్టీ డీఐజీ విజయరావు , ఐపీఎస్ మల్లికా గార్గ్ , ఇతర అధికారులతో చర్చించారు హోం మంత్రి. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి తగిన ఆదేశాల ఇవ్వడం జరిగింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వంగ‌ల‌పూడి అనిత సూచించారు. ప్ర‌తి నిత్యం వేలాది మంది ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం చేస్తుంటార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాల‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల కొంత‌లో కొంతైనా ప్ర‌మాదాల బారి నుండి కాపాడుకునేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *