ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు 1800 మందితో బందోబ‌స్తు

Spread the love

లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ

నంద్యాల జిల్లా : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీ‌శైలంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్. క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. 1800 మందికి పైగా పోలీస్ అధికారుల‌తో పాటు సిబ్బంది విధుల్లో పాలు పంచుకుంటార‌ని తెలిపారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ప్రధానమంత్రి హెలిపాడ్ వ‌ద్ద‌కు చేరుకున్నప్పటి నుండి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించే ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామ‌న్నారు. ముఖ్యమైన ప్రాంతాలలో, కూడళ్లలో సాయిధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసి భద్రతను మ‌రింత‌ కట్టుదిట్టం చేయడం జరిగింద‌ని చెప్పారు.

బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించామ‌న్నారు. ప్రతి సెక్టార్ కు ఒక ఉన్నతాధికారిని ఇన్చార్జిగా నియమించిన‌ట్లు తెలిపారు. జియో గ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాలలో తీసుకోవాల్సిన‌ భద్రతా చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి జిల్లా ఎస్పీ వివరించారు. ప్రధాని మంత్రికి సెక్యూరిటీ ప‌రంగా భారీ భ‌ద్ర‌త ఉంటుంద‌న్నారు ఎస్పీ. రోడ్డు మార్గాలలో, ముఖ్యమైన కూడళ్లలో ,గుడి పరిసర ప్రాంతాలలో రూప్ టాప్ సిబ్బందిని నియమించామ‌న్నారు. వారికి బైనాక్యులర్ తో నిరంతరం పరిశీలించాలని ఆదేశించామ‌న్నారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇది 24/7 కొనసాగించాలన్నారు. కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    Spread the love

    Spread the loveతెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *