మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

Spread the love

అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీని కార‌ణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వ‌ర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి. ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ ను ప్ర‌క‌టించింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఇందులో భాగంగా అప్ర‌మ‌త్తం చేసే ప‌నిలో ప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం ఆయ‌న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కీల‌క స‌మావేశానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్‌, అనిత‌, నారాయ‌ణ‌, నిమ్మ‌ల‌తో పాటు చీఫ్ సెక్ర‌ట‌రీ విజ‌యానంద్ కూడా హాజ‌ర‌య్యారు. ఉన్న‌తాధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు.

కాఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 650 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇక బాపట్లలో 481 , తూర్పు గోదావ‌రి జిల్లాలో 376 కేంద్రాల‌ను అత్య‌థికంగా ఏర్పాటు చేశామ‌న్నారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మాట్లాడుతూ, దక్షిణ రాష్ట్రంలోని తీరప్రాంతమైన శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అవసరమైతే, కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కాపులుప్పాడలో 125 మి.మీ., విశాఖపట్నం గ్రామీణంలో 120 మి.మీ., ఆనందపురంలో 117 మి.మీ. వర్షపాతం నమోదైందని జైన్ తెలిపారు. విశాఖపట్నంలో 52 మి.మీ., కాకినాడలో 21 మి.మీ., నరసాపూర్‌లో 18 మి.మీ., ఆరోగ్యవరంలో 15 మి.మీ., తునిలో 12 మి.మీ., మచిలీపట్నంలో 12 మి.మీ., నెల్లూరులో 11 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *