రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే

వ‌రంగ‌ల్, హుస్నాబాద్ కు వెళ్ల‌నున్నారు

హైద‌రాబాద్ : మొంథా తుపాను ప్ర‌భావం దెబ్బ‌కు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌లు చోట్లు వాగులు, వంక‌లు, న‌దులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున ర‌హ‌దారులు కూడా పాడ‌య్యాయి. చేతికి వ‌చ్చిన పంట‌లు ఎండి పోయాయి. ఇదిలా ఉండ‌గా గురువారం సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించామ‌న్నారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌ర్కార్.

తుపాను కార‌ణంగా తీవ్రంగా దెబ్బ‌తిన్న వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల‌లో శుక్ర‌వారం స్వ‌యంగా ఈసెం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే చేప‌డ‌తార‌ని తెలిపింది. ఆయ‌న తో పాటు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో పాటు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కూడా ప‌ర్య‌టిస్తార‌ని పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంచార్జి మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *