బెదిరించినా ఆగను..వెనక్కి తగ్గను
బ్రిస్బేన్ : ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బెదిరింపులు వచ్చినా బెదిరే ప్రసక్తి లేదన్నాడు. తన జీవితం మొత్తం ప్రేమ, సామరస్యత, శాంతి కోసం కొనసాగుతూనే ఉంటుందన్నాడు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను పాడుతూనే ఉంటానని స్పష్టం చేశాడు. గురువారం దిల్జిత్ దోసాంజ్ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో కచేరీకి ముందు సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ నుండి బెదిరింపులు వచ్చాయి. దీనిపై గాయకుడు సానుకూలంగా స్పందించాడు పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్. వేర్పాటువాద సమూహం తనను బెదిరించిన కొన్ని రోజుల తర్వాత విమర్శలు లేదా ట్రోలింగ్ ఉన్నప్పటికీ ప్రేమ, ఐక్యతను ప్రోత్సహిస్తూనే ఉంటానని అన్నారు.
ప్రజల అభిప్రాయాలతో బాధ పడకుండా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంటానని చెప్పాడు. బ్రిస్బేన్లో ప్రదర్శన ఇచ్చిన 41 ఏళ్ల నటుడు కచేరీ నుండి ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో ప్రజలు ఎల్లప్పుడూ ప్రేమ గురించి మాట్లాడాలని కోరాడు. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులు, నన్ను కన్న భూమితో పాటు గురువు గురు నానక్ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు దిల్జిత్ దోసాంజ్. ఒక రోజు నేను ఈ మట్టికి తిరిగి వస్తాను అని ప్రకటించాడు. ఎవరైనా నన్ను చూసి అసూయపడినా లేదా నన్ను ట్రోల్ చేసినా, నా వైపు నుండి అందరికీ ప్రేమ మాత్రమే ఉంటుంది. నేను ఎల్లప్పుడూ ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేస్తాను. నేను ఎప్పుడూ అలాగే చేశాను. ఎవరైనా దాని గురించి ఎలా భావిస్తున్నారో నాకు పట్టింపు లేదన్నాడు.








