స‌ర్కార్ నిర్వాకం క‌విత ఆగ్ర‌హం

రైత‌న్న‌ల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్

కరీంన‌గ‌ర్ జిల్లా : అకాల వ‌ర్షాల కార‌ణంగా ఆరుగాలం శ్ర‌మించి పండించిన పంట‌లు చేతికి రాకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం మొంథా తుపాను కార‌ణంగా దెబ్బతిన్న పంట‌ల‌ను ప‌రిశీలించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు క‌విత‌. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశ‌శారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.

వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. పదివేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోద‌ని అన్నారు క‌విత‌. రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు స‌ర్కార్ ను. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాల‌ని, అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డకుండా ఆదుకోవాల‌ని కోరారు క‌విత‌. పంట‌ల‌కు ముంద‌స్తుగా బీమా చేసి ఉంటే , కిస్తులు ప్ర‌భుత్వం కట్టి ఉంటే ఈ ఇబ్బంది త‌లెత్తి ఉండేది కాద‌న్నారు. ఇక‌నైనా స‌ర్కార్ ముంద‌స్తుగా నివేదిక‌లు త‌యారు చేయాల‌ని, రైతుల‌ను ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *