newsseals.com
News

నారా లోకేష్ ప్ర‌జా దర్బార్

VijayaBhaskar November 11, 2025
newsseals-NaraLokesh
Spread the love

బాధితుల‌కు మంత్రి భ‌రోసా

అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం మంగ‌ళగిరి లోని క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వహించారు. ఆయ‌న ఎన్నికైన నాటి నుంచి ఈ కార్య‌క్ర‌మం నిరాటంకంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తులు స్వీక‌రించ‌డం, ఆయా స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డం, సంబంధిత మంత్రులు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పంపించేలా చేస్తున్నారు. దీంతో త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నారా లోకేష్ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు జ‌నం. తాను ఎన్నిక‌ల సంద‌ర్బంగా పెద్ద ఎత్తున జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఇదే రీతిన అధికారంలోకి వ‌చ్చాక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ మేర‌కు ప్ర‌తి వారంలో ఒక రోజు ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు మంత్రి నారా లోకేష్‌. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు ప్రజాదర్బార్ చేప‌ట్టారు. మంత్రిని కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు తరలి వచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు నారా లోకేష్. ఈ కార్య‌క్ర‌మం కంటిన్యూగా కొన‌సాగుతుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు ఎవ‌రైనా స‌రే నిర్భ‌యంగా త‌మ బాధ‌లు చెప్పుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు.