అమ‌రావ‌తి రైతులు అధైర్య ప‌డ‌వ‌ద్దు

Spread the love

కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్

అమ‌రావ‌తి : సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. శ‌నివారం స‌చివాల‌యంలో రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై ఏర్పాటైన క‌మిటీ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, సీఆర్డీఏ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు కేంద్ర మంత్రి. ఆరు నెల‌ల కాలంలోనే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. మ‌రోసారి భూములు కోల్పోయిన వారికి సంబంధించి ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా వాటిని ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిబ్రవరి లో కేసు విచారణ జ‌రుగుతుంద‌న్నారు. అయితే అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని చెప్పారు. 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *