అమ‌రావ‌తి రైతులు అధైర్య ప‌డ‌వ‌ద్దు

కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్

అమ‌రావ‌తి : సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. శ‌నివారం స‌చివాల‌యంలో రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై ఏర్పాటైన క‌మిటీ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, సీఆర్డీఏ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు కేంద్ర మంత్రి. ఆరు నెల‌ల కాలంలోనే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. మ‌రోసారి భూములు కోల్పోయిన వారికి సంబంధించి ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా వాటిని ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిబ్రవరి లో కేసు విచారణ జ‌రుగుతుంద‌న్నారు. అయితే అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని చెప్పారు. 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *