newsseals.com
DEVOTIONAL

స్వ‌ర్ణ ర‌థంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం

VijayaBhaskar November 22, 2025
newsseaals-SwarnaRatham
Spread the love

అంగ‌రంగ వైభంగా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ ప‌ద్మ‌వాతి అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త జ‌న బాంధ‌వులు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్ ఇ- 3 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మ వారి ద‌ర్శ‌నం కోసం సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు. ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల నుంచి రావ‌డం విశేషం.