సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు సీఎం కంగ్రాట్స్

ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి కేపీ రాధాకృష్ణ‌న్ , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, అనుముల రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. వీరంతా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. నూత‌న సీజేఐగా కొలువు తీరిన జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విశిష్టమైన, ప్రభావవంతమైన పదవీకాలం ఉండాలని
కోరారు.

ఇదిలా ఉండ‌గా జ‌స్టిస్ సూర్య‌కాంత్ 53వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొలువు తీరారు. త‌న తండ్రి ఓ రైతు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత భావోద్వేగానికి లోన‌య్యారు. సంత‌కం చేసిన వెంట‌నే కీల‌క‌మైన తీర్పులు వెలువ‌రించారు. ఈ సంద‌ర్బంగా పేద‌ల‌కు స‌త్వ‌ర న్యాయం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అత్య‌వ‌స‌ర కేసులు విచారించే సంద‌ర్బంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్. ఇక నుంచి మౌఖికంగా కాకుండా లిఖిత పూర్వ‌కంగా ఆర్జీలు ఇవ్వాల‌ని ఆదేశించారు రిజిస్ట్రార్ ను.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *