మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినంద‌న

ప్ర‌శంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్

అమ‌రావ‌తి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న కనక పుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఉండవల్లి నివాసానికి విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మంత్రి మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా విద్యార్థిని ప్ర‌శంసించారు. చ‌దువుపై మ‌రింత‌గా ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, జీవితంలో ఎద‌గాలంటే విద్య ఒక్క‌టే మార్గ‌మ‌న్నారు. స‌క్సెస్ కు ద‌గ్గ‌రి దారులంటూ లేనే లేవ‌న్నారు. క‌ష్ట ప‌డ‌టం, శ్ర‌మ‌ను న‌మ్ముకుంట‌నే విజ‌యం వ‌రిస్తుంద‌న్నారు. ఎవ‌రిపై దేబ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని, చ‌దువుపై ఫోక‌స్ పెడితే స‌మాజ‌మే మిమ్మ‌ల్ని గుర్తిస్తుందని చెప్పారు నారా లోకేష్‌. భ‌విష్య‌త్తులో మ‌రింత ఎదిగేందుకు తాము స‌హాయ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *