అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ

Spread the love


రాజధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాం

అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు కీల‌క క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో త‌న‌తో పాటు కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఉన్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మావేశం కావ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌ధాని నిర్మాణం కోసం స్వ‌చ్చంధంగా త‌మ భూములు ఇచ్చిన రైతుల‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. చాలా మంది రైతుల‌కు ఇప్ప‌టికే ప‌రిహారం అంద‌జేశామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా సమస్యలు మా దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని, దీనిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడ‌తామ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారని వెల్ల‌డించారు. ఇందులో తాను కూడా సభ్యుడిగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు పొంగూరు నారాయ‌ణ‌. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై అసైన్డ్‌ భూములపై చర్చించాం అన్నారు.

  • Related Posts

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం…

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *