హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం

ప్ర‌క‌టించిన సీఎం, డిప్యూటీ సీఎం

బెంగళూరు : క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభానికి తెర దించారు ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. శ‌నివారం ఈ ఇద్ద‌రు నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ సీఎం పిలుపు మేర‌కు బ్రేక్ ఫాస్ట్ చేశాన‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి నా ఇంటికి భోజనం లేదా విందు కోసం వస్తారని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి దాకా కలిసి పని చేశామన్నారు. రాష్ట్ర కార్మికులు మాకు మద్దతు ఇచ్చారు. కర్ణాటక ప్రజలు మాకు భారీ ఆదేశం ఇచ్చారు. మేము ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాలనైనా, వాటిని నెరవేర్చడం మా విధి.

మా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మా బాధ్యత. మీ మద్దతు మాకు లభించడం మా అదృష్టం, మేము సుపరిపాలనపై దృష్టి సారించిన ప్రభుత్వాన్ని అందిస్తున్నామని తెలిపారు.2028 వ్యూహం డిసెంబర్ 8 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించామన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్ర‌క‌టించారు.

నాయకత్వ సమస్య విషయానికొస్తే, పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం వెళ్తామన్నారు. మేము ఎల్లప్పుడూ పార్టీకి నమ్మకమైన సైనికులం. మేము పార్టీ కార్యకర్తలం, కర్ణాటక కీలక పాత్ర పోషిస్తుందని మాకు నమ్మకం ఉంది, 2028 లో మేము ప్రభుత్వాన్ని పునరావృతం చేస్తామని వెల్ల‌డించారు. 2029 లో కూడా మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతామని స్ప‌ష్టం చేశారు సీఎం, డిప్యూటీ సీఎంలు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *