newsseals.com
News

విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఆదుకుంటాం

VijayaBhaskar November 30, 2025
newsseals-APCM
Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : విభిన్న ప్ర‌తిభావంతుల‌కు పూర్తి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు విన‌త‌లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు దివ్యాంగులు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు ముఖ్య‌మంత్రి. తానే వారి వ‌ద్ద‌కు వెళ్లారు. వారి బాగోగుల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో గ‌తంలో ఏలిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ వికలాంగుల సంక్షేమం కోసం పాటు ప‌డ‌లేద‌ని ఆరోపించారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌రా క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఏపీ సీఎం.

ఎవ‌రూ కూడా మీరు వికలాంగుల‌మ‌ని బాధ ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు. మీ వెంట ప్ర‌భుత్వం ఉంద‌ని మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇప్ప‌టికే ఠంఛ‌న్ గా ఒక‌టో తేదీనే పెన్ష‌న్ ఇస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర ఖ‌జానా దివాలా అంచున ఉన్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రినీ ఇబ్బంది పెట్ట‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రం గాడిన ప‌డింద‌ని చెప్పారు సీఎం. ప్ర‌స్తుతం పాడై పోయిన‌, ప‌క్క‌దారి పట్టిన అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డ్డామ‌న్నారు. అందులో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు చంద్ర‌బాబు నాయుడు.