newsseals.com
News

అమరవీరుల కుటుంబాలకు సన్మానం

VijayaBhaskar November 30, 2025
newsseals-HarishRao
Spread the love

వారి వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌న్న హ‌రీశ్ రావు

సిద్దిపేట జిల్లా : అమ‌ర వీరుల బ‌లిదానం, ఆత్మ త్యాగం , కేసీఆర్ చేసిన పోరాటం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ముగ్గురు ఉద్యమ నాయకులు తెలంగాణ రావాలని, ఇక వస్తదో రాదో అనే ఆవేదన చెంది చని పోయార‌ని గుర్తు చేసుకున్నారు.

అవునూరు సత్తయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయారు.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వారి కుమారుడు సందీప్ కు విద్యాశాఖ లో ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు హ‌రీశ్ రావు. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ చనిపోగా అతని తమ్ముడు శ్రీదర్ కు వెటర్నరీ శాఖ లో ఉద్యోగం కల్పించామ‌న్నారు.
అదే విధంగా కన్నబోయిన ఐలయ్య ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడుతూ ఇక తెలంగాణ రాదు, ఈ కాంగ్రెస్ ఇవ్వదు అనే ఆవేదనతో చనిపోగా వారి కుటుంబంలో వారి కుమారునికి ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు హ‌రీశ్ రావు.

దీక్షా దివస్ సందర్బంగా వారి త్యాగలను కొనియాడుతూ వారిని స్మరిస్తూ వారి కుటుంబాలను మాజీ మంత్రి ఘ‌నంగా స‌న్మానించారు. వారి త్యాగాల‌ను కొనియాడారు. ఇలాంటి వాళ్లు చ‌ని పోలేద‌ని వారు ఇంకా సజీవంగా బ‌తికే ఉన్నార‌ని పేర్కొన్నారు హ‌రీశ్ రావు.