భ‌గవ‌ద్గీత ప్ర‌పంచానికి దిక్సూచి

Spread the love

హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్

తిరుప‌తి : భ‌గ‌వ‌ద్గీత ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించే గొప్ప ఆయుధ‌మ‌ని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సంస్థ ఆధ్వ‌ర్యంలో పోటీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మూడు కేట‌గిరీల‌లో నిర్వ‌హించిన పోటీల‌లో ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాలలో విజేత‌ల‌ను ఎంపిక చేశారు నిర్వాహ‌కులు. ఈ సంద‌ర్భంగా విజేత‌లైన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆముదాల మురళి, కేటివి రాఘవన్, సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెడ్డిపిపి ఏఈవో సి. సత్యనారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోకిల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    టీటీడీ స్థానికాల‌యాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

    Spread the love

    Spread the loveధ‌నుర్మాసం సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యంతిరుప‌తి : టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. ఆరోజు మ‌ధ్యాహ్నం…

    తిరుమ‌ల‌లో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ

    Spread the love

    Spread the love17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *