భ‌గవ‌ద్గీత ప్ర‌పంచానికి దిక్సూచి

హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్

తిరుప‌తి : భ‌గ‌వ‌ద్గీత ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించే గొప్ప ఆయుధ‌మ‌ని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సంస్థ ఆధ్వ‌ర్యంలో పోటీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మూడు కేట‌గిరీల‌లో నిర్వ‌హించిన పోటీల‌లో ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాలలో విజేత‌ల‌ను ఎంపిక చేశారు నిర్వాహ‌కులు. ఈ సంద‌ర్భంగా విజేత‌లైన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆముదాల మురళి, కేటివి రాఘవన్, సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెడ్డిపిపి ఏఈవో సి. సత్యనారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోకిల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *