కాబోతోందని ప్రకటించిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీ ప్రపంచంలో క్వాంటం కంప్యూటర్ల తయారీకి కేరాఫ్ కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం వేలాది మంది విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి క్వాంటం కంప్యూటింగ్ విజన్ ను ఆవిష్కరించారు. రాబోయే ప్రపంచం దీనిని ఉపయోగించు కుంటుందని అన్నారు. అంతే కాదు ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్బంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు సీఎం. దాదాపు 80 శాతం లేదా 85 శాతం కాంపోనెంట్ భాగస్వాములందరూ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ ప్రక్రియ రెండు సంవత్సరాల లోపు క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఉత్పత్తి చేయబడతాయని చెప్పారు. ఎవరైనా ఏదైనా నాలెడ్జ్ కంపెనీ లేదా టెక్నాలజీని ప్రారంభించాలనని అనుకుంటే, వారు అమరావతికి రావాలని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన పరిశోధనలకు క్వాంటం కంప్యూటింగ్లో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఎవరికైనా రూ. 100 కోట్ల అవార్డును నాయుడు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఆవిష్కరణ, ఉత్పత్తి ఆధారిత భవిష్యత్తుకు అనుకూలంగా సాంప్రదాయ ఆలోచనలను విడనాడాలని ఆయన విద్యార్థులకు సూచించారు.






