సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

VijayaBhaskar · December 23, 2025
Spread the love

బిడ్డా రేవంత్ రెడ్డి జ‌ర జాగ్ర‌త్త

హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన సమావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ తర్వాత నోటీసులు ఇస్తామని రేవంత్ రెడ్డి ఈరోజు లీకు ఇచ్చాడని అన్నారు. త‌ను ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుండి దీని గురించి ఏడుస్తూనే ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు జ‌గ‌దీశ్ రెడ్డి.

కరెంట్ గురించి ఏడ్చిండు.. రిపోర్టు రాగానే మడిచి కనబడని చోట పెట్టుకున్నాడంటూ మండిప్డారు. కేసీఆర్ మల్లె పూవు లాగ ఉన్నాడ‌ని అన్నారు. కానీ ఆ విష‌యం తెలుసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇంకెన్ని నాళ్లు అబ‌ద్దాల‌తో స‌ర్కార్ ను న‌డిపిస్తావంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు జ‌గ‌దీశ్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్పగా 24 గంటలు కరెంట్ ఇచ్చాడు అని రిపోర్టులో వచ్చిందన్నారు. అది బ‌య‌ట‌కు రాకుండా మ‌డిచి పెట్టుకున్న‌ది నీవు కాదా అని నిల‌దీశాడు. కాళేశ్వరం మీద ఏడ్చిండు.. కోర్టు దాన్ని రిపేర్ చేయమ‌ని ఆదేశించింద‌న్నారు. ఇప్పుడు ఎక్క‌డ ఏం చెప్పాలో తెలియ‌క మౌనంగా ఉన్నాడ‌ని అన్నారు.