టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

Spread the love

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం

తిరుప‌తి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల‌తో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో 24×7 నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామ‌న్నారు. నకిలీ టోకెన్లు జారీ చేసినా లేదా నకిలీ టోకెన్లతో వచ్చినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చ‌రించారు. భక్తులు ఎలాంటి మధ్యవర్తులు, అనధికార వ్యక్తులను నమ్మకుండా నకిలీ టోకెన్లను తీసుకుని మోసపోవద్దని సూచించారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో, తిరుపతిలోని బస్టాండ్, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయడం జరిగిందన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Related Posts

    శార‌దా పీఠానికే భూములు కేటాయించాలి

    Spread the love

    Spread the loveవెన‌క్కి తగ్గిన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : హైదరాబాద్ కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ…

    టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆల‌యం

    Spread the love

    Spread the loveఆల‌య అధికారుల‌కు అంద‌జేసిన రికార్డులు తిరుపతి : తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *