నేడే ఏపీ కేబినెట్ కీల‌క స‌మావేశం

VijayaBhaskar · January 27, 2026
Spread the love

వెల్ల‌డించిన సీఎస్ విజ‌యానంద్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 29వ తేదీ బుధ‌వారం రోజు ఏపీ కేబిన‌ట్ కీల‌క సమావేశం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఉదయం 10 గంటలకు భేటీ కానుంద‌ని స్ప‌ష్టం చేశారు. పలు కీలక అంశాలపై చర్చించనుంద‌ని పేర్కొన్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఏపీ బడ్జెట్ సెషన్ పై చర్చ జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.

అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకం, రివర్ ఫ్రంట్ లో మెరీనా అభివృద్ధికి ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్ . రాజధానిలో వీధిపోటు ప్లాట్లు 112 వేరే చోట ఇచ్చేందుకు అనుమతి ఇవ్వ‌డం, హడ్కో నుంచి రూ.4,450 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చే విష‌యంపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో వైసీపీ విమర్శలు తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయ‌నున్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అలెర్ట్ గా ఉండాల‌ని హెచ్చ‌రించ‌రాఉ. ఇదిలా ఉండ‌గ‌గా దావోస్ పర్యటన పైనా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.