నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి రమేష్
విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తూ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేష్ నీ పిల్ల చేష్టలకు, నీ వెర్రి చేష్టలకు నేను భయపడనని మండిపడ్డారు. చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలకు స్వస్తి పలకాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు జోగి రమేశ్.
నీ అయ్య, నువ్వు, నన్ను జైలులో పెట్టి రాక్షసానందం పొందింది చాలక నా ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం వదిలేసి సన్నాసుల్లాగ తయారయ్యారు.. ఏం పనులురా ఇవి, పనికి మాలినోడా అంటూ భగ్గుమన్నారు. నేను ఏం చేశానని మా ఇంటిపై దాడి చేశారంటూ ప్రశ్నించారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమని లోకేష్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తాము పవర్ లోకి వచ్చిన రోజున పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు.






