మోదీ కేంద్ర బ‌డ్జెట్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

Spread the love

ఎన్డీయేలో కీల‌క పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ

విజ‌య‌వాడ : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ వ‌ల్ల ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌ని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేద‌న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం కలగలేదని వాపోయారు. కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ మండిప‌డ్డారు. మెట్రో రైలు ప్రస్తావన లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మెట్రో కారిడార్ల సంగతి తేల్చక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్ తో ప్రయోజనం లేదంటూ ఫైర్ అయ్యారు.

ఢిల్లీ తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గం అన్నారు. లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ADB, జపాన్ బ్యాంకుల నుంచి 15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా ? గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన 15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ? గ్యారెంటీ కింద అప్పులు అంటే..ఎవరికి గ్యారెంటీ ? విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా ? అని నిల‌దీశారు అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పడు పూర్తవుతుంది ? ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి అంటూ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు.

  • Related Posts

    బండి కొడుకు కోసం వెతికినా దొర‌క‌డం లేదు

    Spread the love

    Spread the loveచేతులు ఎత్తేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డిహైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సుపుత్రుడు బండి సాయి ద‌శ‌ర‌థ్ పోక్సో కేసు. ఇప్ప‌టికే బాధితురాలి…

    అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

    Spread the love

    Spread the loveబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *