ప్ర‌తి ఎక‌రాకు నీరు ఇవ్వ‌డం నా ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన చంద్ర‌బాబు నాయుడు

క‌ర్నూలు జిల్లా : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం అని ప్ర‌క‌టించారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరు అందిస్తే రాష్ట్ర మంతటా నీరు ఇచ్చినట్టేన‌ని అన్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై వేరే వారి ఫొటోలు వేయడం ఏమిట‌ని తాను గత ఎన్నికల్లో ప్రశ్నించానని గుర్తు చేశారు. గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారంటూ మండిప‌డ్డారు. ప్రజల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు ముద్రించుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22 ఏలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు పులివెందుల నుంచి మనుషులను తెచ్చుకున్నారని సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు.

రీ సర్వే పేరుతో రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు నారా చంద్ర‌బాబు నాయుడు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం శాడిజం కాదా? లక్షల ఎకరాల ప్రైవైటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చేశారు. రికార్డులు తారుమారు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన హెలీప్యాడ్ కోసం..70 ఏళ్లుగా పక్కా డాక్యుమెంట్లు ఉన్న భూమిని ఒక వ్యక్తి దగ్గర బలవంతంగా తీసుకుని ప్రభుత్వ భూమిగా మార్చేశారని ఆరోపించారు. ఇదేమని అడిగితే 22 ఏలో పెట్టి వివాదం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతం పైగా అర్జీలు రెవెన్యూ పరమైనవే వస్తున్నాయని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఏమీ తెలీనట్టు గత ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలన చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు సమర్థవంతంగా పని చేస్తే ఇన్ని సమస్యలు ఎలా వచ్చాయి? నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. నా జీవితంలో ఇలాంటి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *