బీసీల స‌త్తా ఏమిటో చూపించారు : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

VijayaBhaskar · February 14, 2026
Spread the love

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డయ్యాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బీసీ జేఏసీ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిని చేరదీసి గులాబీ కండువ కప్పి, బీ ఫామ్ చేతిలో పెట్టిన బిఆర్ఎస్ పార్టీ, మాధవరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇప్పటికైనా తక్షణమే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో బీసీ సమాజం ముందు బిఆర్ఎస్ ను , మల్లారెడ్డిని దోషి గా నిలబెడతామని ఆయన హెచ్చరించారు

న్యాయమైన, ధర్మమైన బీసీ రిజర్వేషన్ల పెంపును భవిష్యత్తులో దయచేసి ఎవరూ అడ్డుకోవ‌ద్ద‌ని లేక పోతే కేశవాపూర్ ఫ‌లితం రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతుంద‌ని పేర్కొన్నారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఇక నుంచి
ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే మెజార్టీగా ఉన్న బీసీలు కచ్చితంగా వాళ్లని బీసీ ద్రోహులుగా ప్రకటించి తీరుతార‌ని పేర్కొన్నారు. మాధవ రెడ్డిని ఏ విధంగా ఒడించామో అదే విధంగా రిజర్వేషన్ వ్యతిరేకుల కూడా రాజకీయంగా భూస్థాపితం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు .