పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి

Spread the love

భ‌క్తుల‌ను అనుగ్ర‌హించిన స్వామి

తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీ కపిలేశ్వర ఆల‌యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తొమ్మిదో రోజైన సోమ‌వారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.

కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కంద మూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌క‌లు,ఇత‌ర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందింద‌ని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం…

    నంది వాహనం కైలాసనాథుడి ద‌ర్శ‌నం

    Spread the love

    Spread the loveశ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *