చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న

శాస‌న స‌భ‌ను సంద‌ర్శించిన అనంత‌పురం విద్యార్థులు

అమ‌రావ‌తి : అనంత‌పురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాస‌న స‌భ‌ను సంద‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని , శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని క‌లిశారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వ‌యంగా ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు స‌మాధానాలు ఇచ్చారు.

ఈ సంద‌ర్బంగా స్పీక‌ర్ కీల‌క సూచ‌న‌లు చేశారు. విద్యార్థులు చ‌దువుతో పాటు జాబ్స్ కోసం కాకుండా రాజ‌కీయాల‌లో చేరేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. చ‌ట్టాల‌ను చేసే అత్యున్న‌త దేవాల‌యం కేవ‌లం శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి మాత్ర‌మేన‌ని చెప్పారు. ఈ దేశం న‌డుస్తున్న‌ది కేవ‌లం డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్ల‌నేన‌ని, దీనిని మీరు త‌ప్ప‌కుండా తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు. ఇదిలా ఉండ‌గా అసెంబ్లీని సంద‌ర్శించిన విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *