రాజ్య‌స‌భ అభ్య‌ర్థులపై హై క‌మాండ్ దే ఫైన‌ల్

స్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌లో రాజ్యస‌భ స‌భ్యుల ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఎన్నిక నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా నోటిఫికేష‌న్ ఇవ్వ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై అంతిమ నిర్ణ‌యం పార్టీ హైకమాండ్ చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో త‌న ప్రమ‌యేం అనేది ఉండ‌ద‌ని అన్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంద‌ని, గ్రామ‌, ప‌ట్ట‌ణ స్థాయిలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించామ‌న్నారు.

67 శాతం వార్డు మెంబెర్స్ సీట్ల‌ను బీసీ లకు ఇచ్చామ‌ని చెప్పారు మ‌హేష్ కుమార్ గౌడ్. మేయర్, మున్సిపల్ చైర్మన్ లలో 50 శాతం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ్యసభ బీసీకి ఇస్తారా లేదా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని మాజీ మంత్రి , సీనియ‌ర్ నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి అర్థం చేసుకోవాల‌ని అన్నారు. సీట్ల‌ను స‌ర్వే ప్ర‌కారం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. స‌భ్యుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ల ఎంపిక పూర్త‌యింద‌ని చెప్పారు టీపీసీసీ చీఫ్‌. మున్సిపల్ ఎన్నికల తర్వాత హైక‌మాండ్ పూర్తి సంతృప్తితో ఉందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *