అవినీతిమ‌యంగా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్

VijayaBhaskar · March 13, 2026
Spread the love

నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి

తిరుప‌తి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎవ‌రిని ఉద్దరించేందుకు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి యుద్ద విమానాలు కొంటున్నార‌ని ప్ర‌శ్నించారు ప్ర‌ధాన‌మంత్రి మోదీని ఉద్దేశించి.
నెహ్రూ, మన్మోహన్ సింగ్ హ‌యాంలో ప్రజల డబ్బుతో ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారో చెప్పాల‌న్నారు.
యుద్ధం జరగబోయే రెండు రోజుల ముందు ప్రధాని ఇజ్రాయెల్ వెళ్లాడు. శాలువాలు కప్పించుకున్నాడు. ఆయన సాధించిన విదేశీ దౌత్య విజయాలు ఏమిటో దేశానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు చింతా మోహ‌న్.

ఇక ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఉద్దేశించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీ కి నలుగురు బ్రోకర్లు ఉన్నారని, వాళ్ళు చెప్పిన పనులే అధికారులు చేస్తున్నారని, ఫైళ్ళపై సంకాతాలు పెడుతున్నారంటూ భ‌గ్గుమ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూట‌మి స‌ర్కార్ హ‌యాంలో అవినీతిలో కూరుకు పోయిందన్నారు. పేరుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటూ ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కలెక్టర్లతో కాన్ఫరెన్స్, పింఛన్లు పంపిణీకే ముఖ్యమంత్రి పరిమితం అవుతున్నారంటూ ఆయ‌న వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేద‌న్నారు చింతా మోహ‌న్. హైదరాబాద్ లో ఇంకా 50 ఏళ్ళ కామన్ క్యాపిటల్ గా వుండివుండొచ్చు. కానీ కెసిఆర్ కేసు, అరెస్టుకు భయపడి చంద్రబాబు అమరావతికి పరుగెత్తాడ‌ని అన్నారు.