భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన ఈవో

Spread the love

ఈవోకు వివ‌రించిన కౌంట‌ర్ సిబ్బంది

తిరుపతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పని తీరును టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర పరిశీలించారు. టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తో కలిసి ఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు తరలించే విధానంపై అధికారులు ఈవోకు వివరించారు. లగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రూపొందే క్యూఆర్ కోడ్‌తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

సాధారణ రోజుల్లో సుమారు 6 వేల బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10 వేల వరకు బ్యాగులు తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు ఈవోకు వివరించారు. అనంతరం ఈవో లగేజి కౌంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అలిపిరి ఏవిఎస్వో రమేష్ కృష్ణన్ , ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    19న శ్రీ గోవింద‌రాజ స్వామి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

    Spread the love

    Spread the loveమార్చి 16న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం తిరుప‌తి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు,…

    రేపే పుష్ప యాగానికి అంకురార్ప‌ణ

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాలక మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తి లోని ప్ర‌సిద్ది చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పుష్ప యాగానికి మార్చి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *