రాజస్తాన్ రాయల్స్ తో కీలక పోరు
గౌహతి : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది గౌహతి. ఇప్పటికే టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ పరాజయం పొందింది. ఇక కీలకమైన మరో లీగ్ మ్యాచ్ ఇవాళ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది.
గత కొన్నేళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు స్టార్ కేరళ క్రికెటర్ సంజు శాంసన్. ఇదే క్రమంలో ఊహించని విధంగాను తను ఆ జట్టును వదిలి పెట్టాడు. ట్రేడింగ్ లో తనను సీఎస్కే యాజమాన్యం తీసుకుంది. తమ జట్టు నుంచి కీలకమైన ఇద్దరు క్రికెటర్లు సామ్ కరణ్ , రవీంద్ర జడేజాలను వదులుకుంది. ఏకంగా సంజు శాంసన్ ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానుంది శాంసన్ కు. ఎలా ఆడతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.








