30 వేల మందిని తొల‌గించిన ఒరాకిల్

ఐటీ కంపెనీల‌లో లే ఆఫ్స్ కొన‌సాగింపు

అమెరికా : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ ఒరాకిల్ బుధ‌వారం కోలుకోలేని షాక్ ఇచ్చింది త‌మ కంపెనీలో ప‌ని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గ‌త కొన్ని రోజులుగా తొల‌గించ బోతున్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం ఇవాల్టి లే ఆఫ్స్ లెట‌ర్స్ జారీతో నిజ‌మైంది. ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెట్టింది .దీని ప్రభావం ఇండియాపై కూడా గట్టిగా పడింది. చాలా టీమ్స్‌కు ఉదయం 5-6 గంటలకు ఈ-మెయిల్స్ వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందనేది మెయిల్ సారాంశం.

ఇదిలా ఉండ‌గా ఒరాకిల్ సంస్థ‌కు ఇండియాలో 30 వేల మంది ఉద్యోగులున్నారు. వీళ్లలో 12వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది కంపెనీ. మరో విడత కూడా ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని టాక్. ఇక భార‌త్ వ‌ర‌కు వ‌స్తే ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి, తొలగింపు తేదీ వరకు ఒక నెల చెల్లించని వేతనాలతో పాటు, 15 రోజుల జీతాన్ని కూడా కంపెనీ ఆఫర్ చేసింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. నెల రోజుల్లోగా మరో విడత తొలగింపులు ఉండవచ్చని ప్రభావిత ఉద్యోగులు తెలిపారు. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఒరాకిల్ నిరాకరించింది.

  • Related Posts

    ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

    అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

    వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *