అరాచ‌క పాల‌న సాగిస్తున్న స్టాలిన్ : విజ‌య్


త‌న ఆస్తుల విలువ రూ. 640 కోట్లు

చెన్నై : టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి డీఎంకే పార్టీపై, అధికారంలో కొన‌సాగుతున్న స్టాలిన్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి రాష్ట్రంలో. పెరంబూరులో ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న ఆస్తుల విలువ రూ. 640.50 కోట్లు అని వెల్ల‌డించారు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో. నామినేష‌న్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు విజ‌య్. సీఎం స్టాలిన్ ను ఏకి పారేశారు. త‌ను అరాచ‌క పాల‌న‌కు తెర తీశార‌ని, త‌న‌కు మంగళం పాడాల‌ని పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీని దుష్ట శ‌క్తిగా పేర్కొన్నారు. తాను గతంలో చేసిన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు.

మనం తమిళనాడును కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేశార‌ని సీఎంపై మండిప‌డ్డారు. ఈ ద‌య‌నీయ స్థితికి కార‌ణం డీఎంకే స‌ర్కార్ అని ఆరోపించారు విజ‌య్. తనపై ప్రజలకు ఉన్న అభిమాన రుణం తీర్చుకోవడానికే, తాను సుఖవంతమైన జీవితాన్ని త్యజించి రాజకీయాల్లోకి వచ్చానని ప్ర‌క‌టించారు. నేను ఎంతో బాధను భరించి, కేవలం మీ కోసమే (రాజకీయాల్లోకి) వచ్చాను. నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను, మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయను అని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్న స్టాలిన్ మీకు కావాలా? లేక ప్రజలను ప్రేమించే విజయ్ మీకు కావాలా? అనేది మీరే తేల్చు కోవాల‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *