వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు తెలంగాణ స‌ర్కార్ చేయూత

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ ర‌డ్డి

హైద‌రాబాద్ : వ‌స్త్ర ప‌రిశ్ర‌మ రంగానికి తెలంగాణ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇతోధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, త్వరితగతిన అనుమతులు, భూమి, విద్యుత్, నీటి విషయంలో మద్దతు అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతే కాకుండా 2047 నాటికి రాష్ట్రాన్ని దక్షిణాసియా వస్త్ర రాజధానిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను పునరుద్ఘాటించారు మ‌రోసారి.

2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. సుస్థిరత ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేయడానికి. ముఖ్యంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రణాళికలను ప్రకటించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ, తెలంగాణ పటిష్టమైన పర్యావరణ వ్యవస్థను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను , ప్రగతిశీల విధానాల చట్రాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు; ప్రపంచ స్థాయిలో పోటీపడగలిగే వస్త్ర పరిశ్రమను నిర్మించడంలో భాగస్వాములు కావాల‌ని సీఎం పిలుపునిచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *