ప్రైవేట్ స్కూల్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ఆయన బాధ్యత కలిగిన సీఎం . ఓ వైపు ప్రభుత్వ స్కూల్స్ గురించి పట్టించు కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మౌలిక వసతుల సదుపాయాలు లేక నానా తంటాలు పడుతున్నాయి. ఈ తరుణంలో సీఎంతో పాటు కీలకమైన విద్యా శాఖను కూడా చూస్తున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన ఏకంగా హైదరాబాద్ లో భారీ ఖర్చుతో నిర్మించిన ప్రైవేట్ స్కూల్ ను ప్రారంభించారు. ఆపై అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న తను ఇలా మాట్లాడటం పట్ల ప్రజాస్వామిక వాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు ఏసిన AVN లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ క్యాంపస్ ను గమనిస్తే నా బ్రెయిన్ చైల్డ్ మాదిరిగా ఉందన్నారు.ప్రభుత్వ విద్య పైన మేం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అని చెప్పారు. 100 నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించారు. రెండో విడతలో మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఏఐ పరిణామాల నేపథ్యంలో విద్య వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం అని తెలిపారు. విద్యార్థులకు కొత్త నైపుణ్యాలను నేర్పించే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. రేపటి ఉపాధికి అనుగుణంగా విద్య ప్రమాణాలు, అది నేర్పించే నైపుణ్యాలు ఉండాలన్నారు.






