శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌త్యేక పాల‌సీ

తీసుకు వ‌స్తున్నామ‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్రత్యేక‌మైన పాల‌సీని తీసుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత . అమ‌రావ‌తిలోని సచివాలయం బ్లాక్-2లో నిర్వహించిన లిటిగేషన్ పాలసీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ , వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి హోం మంత్రి పాల్గొన్నారు.

ప్ర‌ధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ న్యాయ వ్యవహారాలు , కేసుల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించడం జ‌రిగింద‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. ​ముఖ్యంగా కేసుల పరిష్కారంలో సమయ పాలన పాటించడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, సమగ్రమైన పాలసీ రూపకల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత న్యాయ పరమైన పారదర్శకతను, పనితీరులో సమర్థతను పెంపు పొందించే దిశగా ఈ లిటిగేషన్ పాలసీని బలోపేతం చేయాలని నిర్ణయించిన‌ట్లు వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *