నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్ : ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి నిప్పులు చెరిగారు. ఆమె సీరియస్ గా స్పందించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసు కోవడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బేషరతుగా నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు రాములమ్మ.
పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఊరికే రాలేదని, 1200 మంది బలిదానం చేసుకుంటే వచ్చిందని అన్నారు విజయశాంతి. చరిత్ర తెలుసుకోకుండా నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే బాగుండదని అన్నారు. ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా మాట్లాడటం సభ్యత అనిపించు కోదని పేర్కొన్నారు రాములమ్మ.







