newsseals.com
News

మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం

VijayaBhaskar April 18, 2026
newsseals-Ponguleti
Spread the love

స‌మీక్ష చేప‌ట్టిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తీపి క‌బురు చెప్పారు. ఇవాళ స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యంలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు ఉన్న‌తాధికారుల‌కు. త‌మ రాష్ట్రం భూములు ఇచ్చేందుకు సిద్దంగా ఉంద‌న్నారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ప‌డ‌నున్నాయి. అంతే కాకుండా కేవ‌లం రాబోయే రెండు నెల‌ల కాలంలో వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఇప్ప‌టికే ప‌లు ఎక‌రాల‌ను సేక‌రించామ‌న్నారు మంత్రి. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 953 ఎకరాల భూమి సేకరించి కేంద్రానికి అప్పగించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల పైనా దృష్టి సారించామ‌న్నారు. ఇందుకు సంబంధించి యాక్ష‌న్ ప్లాన్ కూడా రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు.
ఈ సమావేశంలో ఏవియేషన్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఈడీ పాల్గొన్నారు. మంత్రితో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు.