ఆర్టిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్క‌ర్ ప్ర‌య‌త్నం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ నాయకులతో ఈ రోజు ప్రజా భవన్‌లో సమావేశమై వారి సమస్యలపై చర్చించడం జ‌రిగింద‌న్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.స్ప‌ష్టం చేశారు, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో వెంటనే సమావేశమై అంశాల వారీగా చర్చించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.

మనది ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఉద్యోగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు తాముఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అని ప్ర‌క‌టించారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించినందుకు జేఏసీ నాయకులను అభినందిస్తున్నానని అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ప్ర‌స్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని స‌హ‌క‌రించాల‌ని కోర‌డం జ‌రిగింద‌న్నారు. ఆర్టిజ‌న్లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *