తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

Spread the love

కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో

త‌మిళ‌నాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాళ‌ అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు సీఎం. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం హోసూరు నుంచి తళ్లి చేరుకుని సాయంత్రం 4.45 గంటలకు ప్రచార ర్యాలీకి హాజరవుతారు.

రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో జరుగనున్న రోడ్ షోలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు. రేపు రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం చంద్రబాబు… 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి బయల్దేరి మధురై చేరుకోనున్నారు. మధురై సమీపంలోని సాత్తూర్ లో మధ్యాహ్నం 1 గంటకు వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 3 గంటలకు సాత్తూర్ లోనే ఎన్డీఏ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు మధురై నుంచి హైదరాబాద్ కు వెళ్తారు.

  • Related Posts

    బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    Spread the love

    Spread the loveతెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు.…

    కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    Spread the love

    Spread the loveమంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *