ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండ‌రాం ప్ర‌మాణం

అభినందించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఉత్కంఠ‌కు తెర దించారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్. ఎమ్మెల్సీలుగా గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్, కోదండ‌రాం రెడ్డికి. దీంతో వారు సంతోషానికి లోన‌య్యారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, వైస్ చైర్మ‌న్ బండ ప్ర‌కాష్ తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డిలు కొలువు తీరారు. చైర్మ‌న్ స‌మ‌క్షంలో అజారుద్దీన్, కోదండ రాంరెడ్డి శాస‌న మండ‌లి స‌భ్యులుగా ప్ర‌మాణం చేశారు. వీరిని ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం, చైర్మ‌న్ డిప్యూటీ చైర్మ‌న్ లు.

ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, వివేక్ వెంక‌టస్వామి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అజారుద్ద‌న్ , కోదండ‌రాంలు ఆయా రంగాల‌లో అనుభవం క‌లిగి ఉన్నార‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *