అభినందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఉత్కంఠకు తెర దించారు రాష్ట్ర గవర్నర్. ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, కోదండరాం రెడ్డికి. దీంతో వారు సంతోషానికి లోనయ్యారు. సోమవారం శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండ ప్రకాష్ తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డిలు కొలువు తీరారు. చైర్మన్ సమక్షంలో అజారుద్దీన్, కోదండ రాంరెడ్డి శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. వీరిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లు.
ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దన్ , కోదండరాంలు ఆయా రంగాలలో అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు.





