పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సంద‌ర్శ‌న‌

Spread the love

అద్భుతంగా ఉంద‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత

సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, స‌త్య కుమార్ యాద‌వ్, అచ్చెన్నాయుడుల తో కూడిన బృందం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ముగిసింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏడవ రోజు న్యూ ఫినిక్స్ పార్క్‌లోని పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అత్యాధునిక AI సాంకేతికత, డేటా అనలిటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నేరాలను అరికట్టడం, అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాలను సమన్వయం చేయడం, భవిష్యత్తు సవాళ్లను ముందే అంచనా వేసి ఎదుర్కోవడానికి సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అద్భుతమైన వ్యూహాలను నిశితంగా పరిశీలించిన‌ట్లు తెలిపారు మంత్రి అనిత‌.

మంత్రుల‌తో క‌లిసి ఈ పర్యటనలో తాము పొందిన అనుభవాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు అత్యుత్తమ భద్రతను , సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎంతగానో దోహద పడతాయని విశ్వసిస్తున్నట్లు వెల్ల‌డించారు మంత్రి అనిత వంగ‌ల‌పూడి.

  • Related Posts

    ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండ‌రాం ప్ర‌మాణం

    Spread the love

    Spread the loveఅభినందించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఉత్కంఠ‌కు తెర దించారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్. ఎమ్మెల్సీలుగా గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్, కోదండ‌రాం రెడ్డికి. దీంతో వారు…

    సింగ‌పూర్ లో ముగిసిన మంత్రుల ప‌ర్య‌ట‌న‌

    Spread the love

    Spread the loveఎన్నో విష‌యాలు నేర్చుకున్నామ‌న్న అనిత‌ సింగ‌పూర్ : సింగపూర్‌లో ఏడు రోజుల పాటు కొనసాగిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన ఈ అధ్యయన యాత్ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *