పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సంద‌ర్శ‌న‌

అద్భుతంగా ఉంద‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత

సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, స‌త్య కుమార్ యాద‌వ్, అచ్చెన్నాయుడుల తో కూడిన బృందం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ముగిసింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏడవ రోజు న్యూ ఫినిక్స్ పార్క్‌లోని పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అత్యాధునిక AI సాంకేతికత, డేటా అనలిటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నేరాలను అరికట్టడం, అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాలను సమన్వయం చేయడం, భవిష్యత్తు సవాళ్లను ముందే అంచనా వేసి ఎదుర్కోవడానికి సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అద్భుతమైన వ్యూహాలను నిశితంగా పరిశీలించిన‌ట్లు తెలిపారు మంత్రి అనిత‌.

మంత్రుల‌తో క‌లిసి ఈ పర్యటనలో తాము పొందిన అనుభవాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు అత్యుత్తమ భద్రతను , సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎంతగానో దోహద పడతాయని విశ్వసిస్తున్నట్లు వెల్ల‌డించారు మంత్రి అనిత వంగ‌ల‌పూడి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *