కీలక వ్యాఖ్యలు చేసిన విప్ పంచుమర్తి అనురాధ
అమరావతి : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ, నిరంతర శ్రమతో గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్కు తీసుకు రావడంలో విజయవంతం అయ్యారని ప్రశంసించారు శాసన మండలి విప్ పంచుమర్తి అనురాధ. కేవలం ఒప్పందం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్ట్ గ్రౌండ్ అయి యువతకు ఉద్యోగాలు కల్పించేలానే ఉద్దేశంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించచారు. గూగుల్ సంస్థకు 610 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఈనెల 28న సీఎం శంకుస్తాపన చేయనున్నారని, ఈ క్రెడిట్ లోకేష్ కు దక్కుతుందన్నారు అనురాధ.
ఇది ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనం అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం 1 గిగావాట్ డేటా హబ్గా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సబ్సీ కేబుల్స్ ద్వారా ప్రపంచానికి డేటా సేవలను అందించే కేంద్రంగా మారనుందని చె్పారు.. క్లౌడ్ ఆపరేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.80 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.





