ప్రపంచానికి గేట్ వే గా హైద‌రాబాద్ గా మారుస్తాం

Spread the love

సంచ‌ల‌న‌ ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో ఈ రోజు “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారం, రైతుల త్యాగాలతో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాం అన్నారు. నూతన నగర నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత నాది అని పేర్కొన్నారు. సామాన్యులు, పేదల విషయంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచన చేయాలని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

ఇక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు మల్కాజ్ గిరి కమిషనరేట్ భవనం, OCTOPUS అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ DCP కార్యాలయ భవనాలను ప్రారంభించారు సీఎం. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయ‌డం సంతోసంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, డి. శ్రీధర్ బాబు, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, శాసన సభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : అన్న‌దాతలు పండించే ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చేస్తున్నామ‌న్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వేసవి కాలంలో తాగునీటి…

    తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

    Spread the love

    Spread the loveపౌర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది డీజిల్, పెట్రోల్ కొర‌త లేకుండా . ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *