కేసీఆర్ నివాసానికి నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ

వివ‌ర‌ణ ఇచ్చిన హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి

హైద‌రాబాద్ : ఎండాకాలం కావ‌డంతో తీవ్ర నీటి ఎద్ద‌డి కొన‌సాగుతోంది హైద‌రాబాద్ న‌గ‌గ‌రంలో. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు లేక పోవ‌డంతో జ‌నం అల్లాడి పోతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌త్యాయ్నాయ ఏర్పాట్ల‌లో మునిగి పోయింది న‌గ‌ర జ‌ల‌మండ‌లి శాఖ‌. ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య‌న మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాసంలో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డడం, నీళ్లు రాక పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో జ‌లమండ‌లి శాఖ వెంట‌నే స్పందించింది. ఈ మేర‌కు వాట‌ర్ ట్యాంక‌ర్ ను పంపించింది. ఈ మేర‌కు కేసీఆర్ నివాసానికి నీటి స‌రఫ‌రాను పున‌రుద్ద‌రించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది జ‌ల‌మండ‌లి. కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

అయితే సాధారణ షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా కొనసాగుతోందని స్ప‌ష్టం చేసింది జలమండలి
సమావేశాలు లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కేసీఆర్ పర్సనల్ పీఏ అభ్యర్థన మేరకు అదనపు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్న‌ట్లు తెలిపింది. గత ఐదేళ్లుగా అవసరాన్ని బట్టి అభ్యర్థన మేరకు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం మీటర్ మరమ్మత్తులో ఉంద‌ని, ఆ కాలనీలో ఒక రోజు విడిచి ఒక రోజు నీటి సరఫరా జరుగుతోందని వెల్ల‌డించింది జ‌ల‌మండ‌లి. ఏప్రిల్ 24న స్టడీ సర్కిల్ వద్ద పైప్‌లైన్ చోక్ కారణంగా తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని, అదే రోజు సమస్యను పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించామ‌ని పేర్కొంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *