కాంగ్రెస్ ముక్తా భార‌త్ అసాధ్యం : పొన్నం

Spread the love

భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు , ప్రజాస్వామ్యం ఉన్నంత దాకా బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం అన్నారు. ప్రజాస్వామ్యాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ విభజన పేరుతో మతతత్వం పేరుమీద రాజకీయాలు చేయడమే శాశ్వతం అనుకుంటున్నారని , అది ఎక్కువ కాలం సాగ‌ద‌న్నారు. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.

కేరళ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం పట్ల కేసి వేణుగోపాల్ నాయకత్వంలో సతీషన్ , చేణితల అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ ,మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కేరళ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదని అన్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఓడినా గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోనే ఉంటాం అని స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్య రక్షణ కు దేశ ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకొస్తార‌ని అన్నారు. తెలంగాణ లో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదన్నారు.

  • Related Posts

    కేర‌ళ విజ‌యం సీఎం సంతోషం

    Spread the love

    Spread the loveనా ప్ర‌చారం వ‌ల్లే యూడీఎఫ్ విక్ట‌రీ హైద‌రాబాద్ : కేర‌ళ‌లో కాంగ్రెస్ పార్టీతో కూడిన యుడీఎఫ్ ఎల్డీఎఫ్ ను కాద‌ని ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. దీనిపై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. త‌ను ప్ర‌చారం కూడా చేశారు.…

    బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డిప్యూటీ సీఎం బెంగ‌ళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా స్పందించారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *