విజ‌య్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తిరుగుబాటు నేత ష‌ణ్ముగం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలాంటి స‌న్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే, ఇత‌ర పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కురిపించాయి. కానీ అనూహ్యంగా కేవ‌లం 2 ఏళ్ల కాలంలోనే , త‌క్కువ వ్య‌వ‌ధిలో 234 సీట్ల‌కు గాను 108 సీట్ల‌ను సాధించి టీవీకే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. బుధ‌వారం స్పీక‌ర్ నేతృత్వంలో శాస‌న స‌భ‌లో బ‌ల ప‌రీక్ష చేప‌ట్టారు. ఇందులో మ్యాజిక్ ఫిగ‌ర్ కు కావాల్సిన సంఖ్య 118. కానీ అంద‌రూ ఆశ్చ‌ర్య పోయేలా విజ‌య్ కు మ‌ద్ద‌తుగా ఏకంగా 144 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేశారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. దీంతో విశ్వాసం నెగ్గింది. సుస్థిర‌మైన ప్ర‌భుత్వానికి మార్గం సుగ‌మం అయ్యింది.

ఈ సంద‌ర్బంగా విశ్వాస ప‌రీక్ష నెగ్గిన అనంత‌రం అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఎమ్మెల్యే సీవీ ష‌ణ్ముగం మీడియాతో మాట్లాడారు. AIADMK తరపున, 25 మంది ఎమ్మెల్యేలు TVK నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు తెలిపారని చెప్పారు. TVKకి మద్దతు ఇవ్వకూడదనే తీర్మానంపై 47 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని EPS చెబుతున్న విషయం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఆ 47 మంది ఎమ్మెల్యేలు అసలు ఎప్పుడు ఈ తీర్మానంపై సంతకాలు చేశారో చెప్పాల‌న్నారు. స్పీక‌ర్ కు స‌మ‌ర్పించిన లేఖ న‌కిలీద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *