newsseals.com
News

విజ‌య్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్

VijayaBhaskar May 13, 2026
newsseals-CVShnmugam
Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తిరుగుబాటు నేత ష‌ణ్ముగం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలాంటి స‌న్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే, ఇత‌ర పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కురిపించాయి. కానీ అనూహ్యంగా కేవ‌లం 2 ఏళ్ల కాలంలోనే , త‌క్కువ వ్య‌వ‌ధిలో 234 సీట్ల‌కు గాను 108 సీట్ల‌ను సాధించి టీవీకే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. బుధ‌వారం స్పీక‌ర్ నేతృత్వంలో శాస‌న స‌భ‌లో బ‌ల ప‌రీక్ష చేప‌ట్టారు. ఇందులో మ్యాజిక్ ఫిగ‌ర్ కు కావాల్సిన సంఖ్య 118. కానీ అంద‌రూ ఆశ్చ‌ర్య పోయేలా విజ‌య్ కు మ‌ద్ద‌తుగా ఏకంగా 144 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేశారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. దీంతో విశ్వాసం నెగ్గింది. సుస్థిర‌మైన ప్ర‌భుత్వానికి మార్గం సుగ‌మం అయ్యింది.

ఈ సంద‌ర్బంగా విశ్వాస ప‌రీక్ష నెగ్గిన అనంత‌రం అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఎమ్మెల్యే సీవీ ష‌ణ్ముగం మీడియాతో మాట్లాడారు. AIADMK తరపున, 25 మంది ఎమ్మెల్యేలు TVK నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు తెలిపారని చెప్పారు. TVKకి మద్దతు ఇవ్వకూడదనే తీర్మానంపై 47 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని EPS చెబుతున్న విషయం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఆ 47 మంది ఎమ్మెల్యేలు అసలు ఎప్పుడు ఈ తీర్మానంపై సంతకాలు చేశారో చెప్పాల‌న్నారు. స్పీక‌ర్ కు స‌మ‌ర్పించిన లేఖ న‌కిలీద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.