బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

Spread the love

ఆదేశించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో మాట్లాడారు. భాదితులు ఉపయోగించిన మైదా పిండి కి సంబందించి, పుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. భాదితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబందిత ఆస్పత్రుల యాజమాన్యాలతో సైతం మాట్లాడారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

భాదితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా, ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని కలెక్టర్ కు సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, భాదితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు నివేదిక అందించాల‌ని పేర్కొన్నారు నిమ్మ‌ల రామానాయుడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు. బాధిత కుటుంబాలు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. స‌ర్కార్ పూర్తిగా అండ‌గా ఉంటుంద‌న్నారు.

  • Related Posts

    ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో సీఎం భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క రంగాల‌లో స‌హ‌కారం పై చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీల‌క రంగాల‌లో స‌హ‌కారంపై చ‌ర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత,…

    స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత

    Spread the love

    Spread the loveయువతకు లక్ష ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న చంద్ర‌బాబు అమ‌రావ‌తి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్‌ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావును అభినందిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *