అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ

హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ సీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి భేటీ అయ్యారు. అగ్రవర్ణ పేదల అభ్యున్నతికై కేంద్రంలో, అన్ని రాష్ట్రాలలో ఈ బీ సీ కమిషన్, ఈ బీ సీ కార్పొరేషన్, ఈ బీ సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని రామచంద్ర రావుని రవీందర్ రెడ్డి కోరారు.

ఎస్సీ, ఎస్ టీ, బీసీ లకు కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలను అగ్రవర్ణాల్లోని పేదలకి వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని రవీందర్ రెడ్డి తెలిపారు .దీనికి రామచంద్ర రావు సానుకూలంగా స్పందంచారు. అగ్రవర్ణ పేదలను అన్నివిధాలా ఆదుకుంటామని అన్నారు. అలాగే ప్రధాన మంత్రికి లేఖ రాస్తానని రామచంద్ర రావు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా తాజాగా బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ విష‌యంపై నోరు జార‌డం తీవ్ర దుమారానికి దారి తీసింది. త‌న‌కు బండికి , పార్టీకి ఏం సంబంధం అంటూ ప్ర‌శ్నించ‌డంతో ప్ర‌జా సంఘాలు, మ‌హిళ‌లు భ‌గ్గుమంటున్నారు. ఎందుకు నోరు మెద‌ప‌డం లేదంటూ నిల‌దీస్తున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *