బండి భ‌గీర‌థ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్

పోలీసుల‌ను ఆదేశించిన న్యాయూమ‌ర్తి
హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి సాయి భ‌గీర‌థ్ కు షాక్ త‌గిలింది. గ‌త 9 రోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్న త‌న‌ను ఎట్ట‌కేల‌కు పోలీసుల ముందు లొంగి పోయేలా చేశారు . చివ‌ర‌కు ఈ విష‌యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న ప‌రువు పోగొట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజ‌య్ కొడుకును ర‌క్షించేలా చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి. ఇక త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ బండి కొడుకు త‌ర‌పున న్యాయ‌వాది నిరంజ‌న్ రెడ్డి వాద‌న‌లు వీగి పోయాయి. కేసును ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌లేనంటూ తేల్చి చెప్పింది. ఇక ర‌క్షిస్తాడ‌ని అనుకున్న రేవంత్ రెడ్డికి కూడా కోలుకోలేని దెబ్బ త‌గిలింది.

ఈ త‌రుణంలో అన్ని డోర్స్ క్లోజ్ కావ‌డంతో బండి సంజ‌య్ త‌న కొడుకును పోలీసుల ముందు లొంగి పోయేలా ప్లాన్ చేశాడు. అంత‌కు ముందు నాలుగు బృందాలు త‌న‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాయి. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే సీపీ ర‌మేష్ రెడ్డి మాత్రం తాము నిందితుడిని ప‌ట్టుకున్నామ‌ని, మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర్చ‌గా 14 రోజుల రిమాండ్ విధించిన‌ట్లు తెలిపారు. మొత్తంగా దేశం కోసం ధ‌ర్మం కోసం అంటూ గొంతులు తించుకునే బీజేపీ నేత‌లు ఎక్క‌డా క‌నిపించ‌కుండా పోయారు. ఇప్ప‌టికే దేశంలో అత్య‌ధిక పోక్సో కేసులు వీరి మీద‌నే న‌మోదు కావ‌డం విశేషం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *